నిత్యా మీనన్ పై బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం

  • August 13, 2016 / 12:39 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చిన కొత్తల్లో “ప్రభాస్ ఎవరు?” అంటూ ప్రశించి ఆయన అభిమానుల ఆగ్రహానికి గురైన నిత్యామీనన్ మరో మారు విమర్శలను ఎదుర్కొంటోంది. కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్  నటించిన ఈ చిత్రంలో నిత్య కీలక రోల్ పోషిస్తోంది. నిన్న జరిగిన జనతా గ్యారేజ్ ఆడియో రిలీజ్ వేడుకకు ఈ మలయాళం బ్యూటీ హాజరైంది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ “నా కెరీర్లో తొలిసారిగా పెద్ద హీరోతో సినిమా చేయటమే కాదు, ఓ పెద్ద కమర్షియల్ మూవీలో నటించాలన్న కోరిక ఇంత కాలానికి తీరింది.

ఇంత మంచి అవకాశం ఇచ్చిన కొరటాల శివకు థాంక్స్” అని చెప్పింది. ఇది వరకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తీసిన సన్నాఫ్ సత్యమూర్తి  మూవీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన నిత్యామీనన్ నటించింది. బన్నీ కూడా టాలీవుడ్ పెద్ద హీరోల్లో ఒకరు. అతనితో నటించి ఉన్నా కూడా ఆ సంగతిని పక్కన పెట్టి తారక్ ని పెద్ద హీరో అనడం బన్నీ ఫ్యాన్స్ జీర్ణించుకోలేక పోతున్నారు. పరిశ్రమ వర్గాల వారు నిత్యాకు పొగరు ఎక్కువ అంటే, ఏమో అనుకున్నాము.. కానీ ఇంత హెడ్ వైట్ ఉందని అనుకోలేదని అల్లు అర్జున్ అభిమానులు ఘాటుగా విమర్శిస్తున్నారు. ఆమెకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు. దీనిపై కేరళ కుట్టి ఏమని సమాధానం ఇచ్చుకుంటుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus