ఆయనతో సెల్ఫీలు ఊరికే ఎవరూ దిగరు మరి

  • July 3, 2018 / 02:16 PM IST

సూర్య తాజా సినిమాలో అవకాశం అందుకొని ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న అల్లు శిరీష్ ఇవాళ ఉదయం ఒక పాపులర్ పర్సన్ ను కలిశాడు. ఆయనేమీ సినిమా సెలబ్రిటీ కాదు, పోలిటికల్ లీడర్ అంతకంటే కాదు.. కానీ తన యాడ్స్ & పబ్లిసిటీతో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన గుండు బాస్ తో సెల్ఫీ దిగాడు అల్లు శిరీష్. ఆ సెల్ఫీని తన ట్విట్టర్ ఎకౌంట్ లో పోస్ట్ చేశాడు. “సెల్ఫీలు ఎవరికీ ఊరికే రావు.. లక్‌ ఉండాలి..హా హా’ అంటూ అల్లు శిరీష్‌ చేసిన ఆ ట్వీట్‌ ప్రస్తుతం వైరల్ అయ్యింది.

“డబ్బులు ఊరికే రావు’ అంటూ లలితా జ్యూయలర్స్‌ కంపెనీ యాడ్‌లో తానే కనపడి ఆకర్షించిన కిరణ్ కుమార్‌ సోషల్ మీడియాలో గుండూ బాస్‌గా ఫేమస్‌ అయిపోయిన విషయం తెలిసిందే. ఆయనను తాను ఓ విమానాశ్రయంలో కలిశానని తెలుపుతూ అల్లు శిరీష్‌ ఈ ట్వీట్‌ చేశాడు. ఓ సెల్ఫీ కావాలని ఆయనను అడిగి తీసుకున్నానని చెబుతూ దాన్ని పోస్ట్‌ చేశాడు. కాగా, శిరీష్‌ నటించిన ‘యుద్ధభూమి’ సినిమా ఇటీవలే విడుదలైన విషయం విదితమే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus