పవన్, మహేష్ బాబు, ఎన్టీఆర్, బాలకృష్ణలు గొప్ప నటులన్న అమీషా పటేల్

  • November 24, 2016 / 08:04 AM IST

బాలీవుడ్ నటి అమీషా పటేల్ టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బద్రి మూవీ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి సూపర్ హిట్ అందుకున్నఈ భామ ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నాని సినిమా చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నరసింహుడు చిత్రంలోనూ కథానాయిక నటించింది. ఈ రెండు చిత్రాలు విజయం సాధించలేదు. నాలుగేళ్లక్రితం నటసింహ నందమూరి బాలకృష్ణతో కలిసి అమీషా చేసిన ఆఖరి చిత్రం పరమవీర చక్ర. అది ఘోర పరాజయం పాలవడంతో ఇక తెలుగును వీడి బాలీవుడ్ కే పరిమితమయింది. అక్కడ కూడా అవకాశాలు సన్నగిల్లడంతో ఐటెం సాంగ్ కి సిద్ధమైంది.

నూతన నటులు ఆశిష్ రాజ్, రుక్సార్ మీర్ జంటగా కొత్త దర్శకుడు రామ్ భీమన తెరకెక్కిస్తున్న ఆకతాయి అనే మూవీలో అమీషా ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఈ పాట కోసం బాలీవుడ్ సుందరి 30 లక్షలు తీసుకుంది. రీసెంట్ గా ఈ పాట షూటింగ్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. “నేను టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ బద్రి తో అడుగు పెట్టాను. అలాగే టాలీవుడ్ నన్ను బాగా ఆదరించింది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, బాలకృష్ణ వంటి గొప్ప నటులతో కలిసి నటించడం నాకు చాలా సంతోషంగా ఉంది” అని అమీషా చెప్పుకొచ్చింది. విజయ్ కరణ్, కౌశల్ కరణ్, అనిల్ కరణ్  సంయుక్తంగా నిర్మిస్తున్న ఆకతాయి మూవీ జనవరిలో రిలీజ్ కి ముస్తాబవుతోంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus