బన్నీతో వరుసగా నాలుగోసారి!

  • August 11, 2016 / 01:46 PM IST

ఇద్దరమ్మాయిలతో సినిమాతో తెలుగు తెరకు పరిచయమయిన నటి కేథరిన్ తెరెసా. ఆ సినిమా తరువాత అమ్మడుకి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. అడపాదడపా అవకాశాలు వచ్చినా..అవి కాస్త ఫ్లాప్స్ గానే మిగిలాయి. దీంతో చెన్నై చెక్కేసిన ఈ భామను బన్నీ పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నాడు. ‘రుద్రమదేవి’,’సరైనోడు’ చిత్రాల్లో బన్నీ సరసన నటించిన ఈ భామ మరోసారి ఈ మెగాహీరో సరసన నటించనుందని టాక్.

అల్లు అర్జున్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. మొదట ఈ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డేను అనుకున్నారు. అమ్మడు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండడం వలన ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపలేదు. తరువాత శృతిహాసన్ అనుకున్నారు. కానీ శృతి డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయింది. దీంతో కేథరిన్ అయితే పెర్ఫెక్ట్ అని భావించిన చిత్ర బృందం ఆ దిశగా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus