మహేష్ బాబు, ఎన్టీఆర్, అఖిల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన చిరంజీవి

  • January 10, 2017 / 10:26 AM IST

సినీ హీరోలకు అభిమానులే బలం. స్టార్స్ కూడా వారిని దృష్టిలో పెట్టుకునే కథలను ఎంచుకుంటుంటారు. హీరోల చిత్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. హీరోల అభిమానుల మధ్య మాత్రం ఆ పోటీ తీవ్రంగా ఉంటుంది. తమ హీరో చిత్రం గురించి ఎవరైనా కామెంట్స్ చేస్తే ఒప్పుకోరు. గొడవకు సైతం దిగుతారు. ఇలా కొట్టుకోవద్దని స్టార్స్ ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవడంలేదు. సంక్రాంతి కి ఖైదీ నంబర్ 150, గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రాలు ఒకరోజు తేడాల్లో రిలీజ్ కానున్నాయి. దీంతో మెగా, నందమూరి అభిమానుల మధ్య గొడవలు వస్తాయేమోనని మెగాస్టార్ చిరంజీవి మొదటి నుంచి అభిమానుల్ని చైతన్య పరుస్తున్నారు.

“మేము తోటి హీరోలందరితో స్నేహంగా ఉంటాము. అభిమానులు కూడా అలాగే స్నేహంగా ఉండాలి. గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా ప్రారంభోత్సాహానికి నేను వెళ్ళాను.” అంటూ గుర్తు చేసుకున్నారు. “నాగార్జున, వెంకటేష్ లతో నాకు మంచి అనుబంధం ఉంది. రామ్ చరణ్ కూడా తోటి హీరోలతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. మొన్న క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి జరుపుకున్నాడు. అలాగే ఎన్టీఆర్  చెర్రీ కి బెస్ట్ ఫ్రెండ్. ఇక అఖిల్ అయితే చరణ్ తో సరదాగా మాట్లాడుకునేందుకు మా ఇంటికి వస్తుంటాడు.”  అని వివరించారు. ఈ విషయాన్ని అభిమానులు దృష్టిలో ఉంచుకొని స్నేహంగా మెలగాలని సూచించారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus