Acharya: ఎన్టీఆర్ కోసం ఆ పని చేస్తున్న కొరటాల శివ..?

  • April 26, 2021 / 08:27 PM IST

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చరణ్ తో కలిసి నటిస్తున్న ఆచార్య మూవీ రిలీజ్ డేట్ మారిందా..? అనే ప్రశ్నకు ఇండస్ట్రీ వర్గాల్లో అవుననే సమాధానం వినిపిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ వల్ల మారిన పరిస్థితుల నేపథ్యంలో మే 13వ తేదీన రిలీజ్ కావాల్సిన ఆచార్య సినిమా రిలీజ్ డేట్ కూడా మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. సినిమా షూటింగ్ లపై అమలవుతున్న ఆంక్షల వల్ల ఆచార్య షూటింగ్ ఇప్పటికీ పూర్తి కాలేదు. తెలంగాణలో థియేటర్లు మూతబడటం, 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను రన్ చేసేందుకు థియేటర్ల యజమానులు ఆసక్తి చూపకపోవడం వల్ల ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ డేట్లను మార్చుకున్నాయి.

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఇప్పటికే ఆచార్య సినిమా డిస్ట్రిబ్యూటర్లకు ఆగష్టులో ఆచార్య సినిమాను రిలీజ్ చేయాలని యోచిస్తున్నట్టు చెప్పారని తెలుస్తోంది. ఆచార్య ఆగష్టులో రిలీజ్ అయితే పుష్ప మూవీ రిలీజ్ డేట్ కూడా మారే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో షూటింగ్ ను మొదలుపెట్టే పరిస్థితులు లేకపోవడం వల్ల ఆచార్య నిర్మాతలు సైతం రిలీజ్ డేట్ వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇప్పటికే కర్ణాటకలో లాక్ డౌన్ అమలవుతున్నట్టు ప్రకటన వెలువడటంతో తెలుగు రాష్ట్రాల్లో సైతం కేసుల సంఖ్య పెరిగితే లాక్ డౌన్ అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అందువల్ల ఆగష్టుకు ఆచార్య పోస్ట్ పోన్ అయినట్టు తెలుస్తోంది. మరోవైపు కొరటాల శివ ఆచార్య షూటింగ్ కు బ్రేకులు పడటంతో ఎన్టీఆర్ సినిమా పనులతో బిజీ అయ్యారని సమాచారం. కొరటాల శివ ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా హీరోయిన్, విలన్, ఇతర కీలక పాత్రలకు సంబంధించిన నటులను ఫైనలైజ్ చేసే పనిలో పడ్డారని తెలుస్తోంది. ఆచార్య షూటింగ్ మొదలయ్యే లోపు ఎన్టీఆర్ సినిమా పనులను పూర్తి చేయాలని కొరటాల శివ భావిస్తున్నారని తెలుస్తోంది.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus