తనపై వస్తున్న వార్తలపై స్పందించిన కీర్తి సురేష్

  • May 16, 2018 / 06:44 AM IST

నటీనటులు తమ సినీ కెరీర్ లో అనేక రకాల పాత్రలు పోషిస్తుంటారు. కానీ కొన్ని పాత్రలు మాత్రం కెరీర్ ని పరుగులు పెట్టిస్తాయి. అందరికన్నా ఎత్తులో నిలబెడుతాయి. అటువంటి వాటిలో సావిత్రి రోల్ ఒకటి. ఆమె మహానటి. ఆ పేరుతోనే నాగ్ అశ్విన్ బయోపిక్ ని తెరకెక్కించారు. సావిత్రిలా కీర్తి నవ్వించారు. ఏడిపించారు. మొత్తానికి జీవించారు. మళ్ళీ అభినేత్రిని వెండితెరపై బతికించారు. ఆమె నటనా ప్రతిభకి కాసులు, అభినందనలు కురుస్తున్నారు. ఈ ఆనందంలోనే కీర్తి తన్న అమ్మమ్మ, అలనాటి నటి సరోజ తో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన ఆమె పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తనకు మహానటి రూపంలో గొప్ప విజయాన్ని అందించినందుకు వెంకన్నను దర్శంచుకున్నానని వివరించారు. అలాగే తనపై వస్తున్న రూమర్లను ఖండించారు. అప్పటి అందాల నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ సినిమా చేస్తున్నారా? అనే ప్రశ్నకు చేయడం లేదని సమాధానం ఇచ్చారు.  ఇప్పటివరకు ఎవరూ తనవద్దకు ఎవరూ ఆ బయోపిక్ ప్రస్తావన తీసుకురాలేదన్నారు. అలాగే తాను సైన్ చేసిన సినిమాలను కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టం చేశారు. మరి అతిలోకసుందరి శ్రీదేవి బయోపిక్ లో నటిస్తారా? అని అడగగా.. చిరునవ్వే సమాధానం అయింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus