ఎన్టీఆర్ కోసం స్టోరీ రెడీ చేసిన క్రిష్

  • December 22, 2016 / 11:23 AM IST

గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల హృదయాలను మెలిపెట్టిన క్రిష్.. కంచె తో స్టార్ డైరక్టర్ హోదాని దక్కించుకున్నారు. ఆ చిత్రం జాతీయ అవార్డు సాధించడంతో ఇండస్ట్రీ దృష్టిని తన వైపు తిప్పుకుని నటసింహ నందమూరి బాలకృష్ణ వందో చిత్రాన్ని డైరక్ట్ చేసే అవకాశాన్ని అందుకున్నారు. దక్కిన ఆఫర్ ని సద్వినియోగం చేసుకొని బాలయ్యని గౌతమీపుత్ర శాతకర్ణి గా అద్భుతంగా చూపించారు. ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియోని చూసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రిష్ ని అభినందించారు. ఆ ప్రశంస ఇచ్చిన ఉత్సాహంతో తారక్ కి క్రిష్ ఒక కథ రెడీ చేసినట్లు తాజా సమాచారం.

గౌతమి పుత్ర శాతకర్ణి రిలీజ్ అయిన వెంటనే ఆ కథను డెవలప్ చేసి ఎన్టీఆర్ కి వినిపించాలనుకుంటున్నట్లు తెలిసింది. యంగ్ టైగర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమాకు ఒకే చెప్పారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ మూవీ సంక్రాంతి తర్వాత సెట్స్ మీదకు వెళ్లనుంది. దీని తర్వాత తారక్ చేయనున్న సినిమా కూడా ఖరారు అయింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరక్షన్లో తొలి సారి నటించనున్నారు. దీని తర్వాత క్రిష్ దర్శకత్వంలో సినిమా ఉంటుంది. బాబాయ్ తో చారిత్రిక కథను తెరకెక్కించిన క్రిష్, అబ్బాయితో ఏ కథతో వస్తారోనని ఇప్పటినుంచే చర్చ మొదలయింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus