ఆ సినిమా చూసిన తర్వాతే తారక్ నిర్ణయం తీసుకుంటారట..

  • November 25, 2016 / 07:36 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ చిత్రంతో పూర్వ వైభవాన్ని సొంతం చేసుకున్నారు. ఫుల్ క్రేజ్ లో ఉన్న తారక్ నెస్ట్ ఏ స్టెప్ తీసుకుంటారోనని అందరూ ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ మాత్రం తొందరపడకుండా ఆలోచిస్తున్నారు. కొత్త దర్శకులు చెబుతున్న కథలు నచ్చుతున్నాయి గానీ, పేపర్ మీద ఉన్న కథను సక్రమంగా తెరకెక్కిస్తారా? లేదో నని అనుమానంతో ముందుకు అడుగువేయలేకపోతున్నారు. ప్రస్తుతం ఆయన కన్ను మెగా సినిమాపై పడిందని సమాచారం. సురేందర్ రెడ్డి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో తెరకెక్కిస్తున్న ధృవ సినిమాను చూసిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారట.

ఎందుకని ఆరా తీస్తే.. ఆ సినిమా టేకింగ్ బాగుంటే సురేందర్ రెడ్డి తో మూవీ చేయాలనీ అనుకుంటున్నారని తెలిసింది. ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్లో అశోక్, ఊసరవెల్లి చిత్రాలు వచ్చాయి. ఆ పరిచయంతో ఎలాగైనా సినిమా ఒకే చేయించొచ్చని ప్లాన్ లో ఉన్నారు. ధృవ సినిమా ఫలితం తారుమారు అయితే ఎన్టీఆర్ సురేందర్ రెడ్డి తో సినిమా చేయడం కష్టమే అంటున్నారు సినీ పెద్దలు. ఎందుకంటే ఇజం ఫెయిల్ వల్ల పూరి జగన్నాథ్ ని సైతం తారక్ పక్కన పెట్టారని చెబుతున్నారు.  సురేందర్ రెడ్డి విషయంలో అదే రిపీట్ అవుతుందా?

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus