Rajamouli: ప్రభాస్ కు కోపం వస్తే అలా చేస్తారా.. ఏం జరిగిందంటే?

  • April 15, 2024 / 12:20 PM IST

ప్రభాస్ (Prabhas) రాజమౌళి (S. S. Rajamouli) కాంబినేషన్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన ఛత్రపతి (Chatrapathi) , బాహుబలి (Baahubali) , బాహుబలి2 (Baahubali 2) బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచి నిర్మాతలకు సైతం మంచి లాభాలను అందించడం గమనార్హం. అయితే ఒక సందర్భంలో స్టార్ హీరో ప్రభాస్ ను జక్కన్న ఇమిటేట్ చేయగా ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. వైరల్ అవుతున్న వీడియో ఓల్డ్ వీడియో కాగా ఛత్రపతి మూవీ ప్రమోషన్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఛత్రపతి మూవీ షూటింగ్ సమయంలో గ్యాప్ తీసుకొని పార్టీ చేసుకుందామని ప్రభాస్ చెప్పగా నేను సరేనని డేట్ ఫిక్స్ చేశామని రాజమౌళి తెలిపారు. అయితే పార్టీ చేసుకోవాల్సిన రోజు కూడా షూట్ ఉండటంతో ఆ సమయంలో ప్రభాస్ ఫీల్ అయ్యాడని రాజమౌళి వెల్లడించారు. ఆ సమయంలో ప్రభాస్ తన కోపాన్ని ఎలా ప్రదర్శించాలో తెలియక “ఏయ్ సెంథిల్ ఎంతసేపయ్యా..! ఎన్నాళ్లయ్యా” అన్నాడని రాజమౌళి ప్రభాస్ ను ఇమిటేట్ చేస్తూ ప్రభాస్ మాడ్యులేషన్ లో కామెంట్లు చేశారు.

రాజమౌళి టాలెంట్ చూసిన నెటిజన్లు జక్కన్న నటనపై పెద్దగా ఫోకస్ పెట్టలేదు కానీ పెట్టి ఉంటే నటుడిగా కూడా ఊహించని స్థాయిలో సక్సెస్ అయ్యేవాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బాహుబలి3 ఎప్పుడు తీస్తారంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. రాజమౌళి ప్రస్తుతం మహేష్ సినిమాతో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులకే జక్కన్న చాలా సమయం కేటాయించారు. రాజమౌళి ఈ సినిమా షూటింగ్ అయినా వేగంగా పూర్తి చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాజమౌళి టాలెంట్, క్రేజ్ వేరే లెవెల్ అని ఫ్యాన్స్ చెబుతున్నారు. జక్కన్న ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారని ఇకపై కూడా ఆయనకు భారీ బ్లాక్ బస్టర్ హిట్లు దక్కాలని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus