హాట్ టాపిక్ గా మారిన సునీత కామెంట్స్!

  • November 24, 2017 / 11:35 AM IST

హైదరాబాద్‌లో  ఈ నెల 28నుంచి గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ వీక్ ప్రారంభం కానుంది. ఈ సదస్సులో  వివిధ దేశాల నుంచి వచ్చే ఆవిష్కర్తలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ కూడా పాల్గొననుంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఇవాంకా ప్రయాణించే హైటెక్ రోడ్లను సర్వాంగా సుందరంగా తీర్చి దిద్దుతున్నారు. గుంతలు లేకుండా పూడ్చమే కాదు.. ఫ్లై ఓవర్ బ్రిడ్జి లకు అందమైన పెయింట్స్ వేస్తున్నారు. ఇది చూసిన నగరవాసులు రోజూ ప్రయాణించే మాపై అభిమానం లేదుగానీ ట్రంప్ కూతురిపై తెలంగాణ ప్రభుత్వం ప్రేమ వొలకబోస్తోందని కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా సింగర్ సునీత ఇవంకా పర్యటనపై సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు. “రాయదుర్గం-ఖాజాగూడ రోడ్డు గుండా ఇవాంకా రావడం లేదేమో? వస్తే బాగుండును” అని ఒక పోస్ట్ చేశారు. ఇవాంకా ఆ రూట్లో ప్రయాణించినట్లయితే అవి కూడా బాగుపడతాయనే ఉద్దేశంతో సునీత అలా కామెంట్ చేశారు. సునీత పోస్టింగ్‌కు పలువురు మద్దతు తెలుపుతున్నారు. ప్రభుత్వాన్ని కొంతమంది ఇలా విమర్శిస్తుంటే..  ట్రంప్ కూతురి రాక పుణ్యమాని కొన్ని రోడ్లైనా బాగుపడుతోందని ప్రశంసిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus