మెగా హీరోల మధ్య వివాదం….

  • August 16, 2016 / 12:03 PM IST

టాలీవుడ్ టాప్ హీరో ఎవరు అంటే….మెగాస్టార్ చిరంజీవి అని చెప్పుకున్న రోజులు చాలానే ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన రాజకీయ తీర్ధం పుచ్చుకోవడం, అదే క్రమంలో యువ హీరోల తాకిడి ఎక్కువ కావడంతో ఆస్థానాన్ని ఎవరు సొంతం చేసుకుంటారో ఎవ్వరూ అర్ధం కావడంలేదు. ఇదిలా ఉంటే తాజాగా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు మెగా-పవర్ స్టార్ ను అండగా చేసుకుని వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారుతున్నారు…

ప్రతీ వేడుకల పవర్ స్టార్ ఫ్యాన్స్ చేస్తున్న హంగామాకు చెక్ పెట్టే దిశగా “చెప్పను బ్రదర్” అన్న మాట మన స్టైలిష్ స్టార్ నుంచి రావడంతో అటు పవర్ స్టార్ ఫ్యాన్స్, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య వైరం ఏర్పడింది. అయితే అదేదో సర్దుమణిగిపోతుందిలే అని అనుకుంటున్న తరుణంలో తిక్క ఆడియో వేడుక జరిగింది. ఈ ఆడియోలో మరో మెగా హీరో సాయి ధర్మ తేజ…బన్నీకి కౌంటర్ గా చెబుతాను బ్రదర్ అని అనడంతో కోపంతో ఊగిపోయిన బన్నీ ఫ్యాన్స్ సాయిని టార్గెట్ చేశారు…సాయి చెప్పిన…. ‘చెబుతాను బ్రదర్’ అన్న డైలాగ్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి.

ఎవరు పెడుతున్నారో తెలియదు గానీ ‘అల్లు అర్జున్ ఫ్యా’న్స్ అనే పేజీలు క్రియేట్ చేసి సాయి ధరమ్ తేజ్ పై సెటర్లు వేస్తున్నారు. తేజు కొత్త సినిమా తిక్క నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది.అయితే ఈ సినిమా పరమ చెత్తగా వుందని సెటైర్లు వేస్తున్నారు కొందరు. ఇప్పుడీ సినిమాని టార్గెట్ చేసుకొని’ #తిక్క కుదిరింది బ్రదర్” అనే హ్యాష్ ట్యాగ్ తో పోస్టలు కొడుతున్నారు నెటిజన్లు. దీనికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని కలరింగ్ ఇస్తున్నారు. ఏది ఏమైనా..దీన్ని త్వరలోనే అడ్డుకోకపోతే ఇది చాలా దూరం వెళ్లే ప్రమధం ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus