దర్శకుడు పరశురామ్ ఫ్యామిలీ ఫోటోలు వైరల్..!

దర్శకుడు పరశురామ్ పెట్ల అలియాస్ బుజ్జి..! ఇతని గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 

‘యువత’ ‘ఆంజనేయులు’ ‘సోలో’ ‘సారొచ్చారు’ ‘శ్రీరస్తు శుభమస్తు’ ‘గీత గోవిందం’ ‘సర్కారు వారి పాట’ వంటి చిత్రాలతో స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. 

దర్శకుడిగా మారక ముందు నటుడిగా, స్క్రీన్ ప్లే రచయితగా, అసోసియేట్ డైరెక్టర్ గా కూడా పనిచేశాడు

పరశురామ్ వైజాగ్ దగ్గర చెర్లోపాలెం కు చెందిన వ్యక్తి. అక్కడే పీజీ వరకు చదువుకున్నాడు.

దర్శకుడిగా మారాలనే లక్ష్యంతో ఇతను హైదరాబాద్ వచ్చి పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ ‘ఆంధ్రావాలా’ ‘143’ వంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. 

ఇతను పూరికి ఏమాత్రం తీసిపోని దర్శకుడు అనే చెప్పాలి. ఇదిలా ఉండగా.. 

పరశురామ్ పర్సనల్ లైఫ్ గురించి జనాలకు ఎక్కువగా తెలిసుండదు. ఇతని భార్య పేరు అర్చన.

ఇతనికి ఇద్దరు పిల్లలు అభి, ఋషి.వీళ్ళ ఫ్యామిలీ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి