32 వంటకాలతో అభిమానులకు భోజనాలు.. కృష్ణ పెద్ద కర్మ ఘనంగా నిర్వహించిన మహేష్!

కృష్ణ – కృష్ణంరాజు ఇద్దరూ కూడా మంచి స్నేహితులు. ఇద్దరూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా ఎంట్రీ ఇచ్చి హీరోలు అయ్యారు. ఇద్దరూ స్టార్ హీరోలు అయ్యారు.

మహేష్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలను మనకు అందించారు. విషాదకరమైన విషయం ఏంటి అంటే ఇద్దరూ కూడా ఈ ఏడాదే మరణించారు.

కృష్ణంరాజు గారు పోయినప్పుడు ప్రభాస్ చాలా విషాదంలో కూరుకుపోయాడు.

అలాగే కృష్ణ ప్రాణం విడిచినప్పుడు మహేష్ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు.

ఇదిలా ఉండగా.. కృష్ణ, కృష్ణంరాజు ఇద్దరిలో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటి అంటే.. వాళ్ళు అభిమానులను రిసీవ్ చేసుకునే పద్దతి చాలా గొప్పగా ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళు అభిమానులకు, మీడియా మిత్రులకు రకరకాల వంటలతో కడుపు నిండా భోజనం పెట్టి పంపేవారు.

అందుకే కృష్ణంరాజు పోయినప్పుడు ఆయన సొంత ఊరికి వెళ్లి అక్కడి అభిమానులకు 50 రకాల వంటలతో భోజనాలు పెట్టించాడు ప్రభాస్. అలా కృష్ణంరాజు పెద్దకర్మని ఘనంగా నిర్వహించారు.

ఇప్పుడు మహేష్ వంతు వచ్చింది. కృష్ణ గారి పెద్ద కార్యక్రమాన్ని ఈరోజు అనగా ఆదివారం నవంబర్ 27న ఘనంగా నిర్వహించారు.

తెనాలి, గుంటూరు ఏరియాల నుండీ వచ్చిన అభిమానులకు ఏకంగా 32 రకాల వంటలు అలాగే స్వీట్స్ తో కడుపు నింపి పంపాడు. హైదరాబాద్, హైటెక్ సిటీలోని ఎన్కన్వెన్షన్ సెంటర్ లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.