ఘనంగా గౌతమ్ – మంజిమా ల పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు

కోలీవుడ్ లవ్ బర్డ్స్ అయిన గౌత‌మ్ కార్తిక్‌, మంజిమా మోహ‌న్ ల పెళ్లి ఘనంగా జరిగింది. సోమవారం(నవంబర్ 28) నాడు వీరి పెళ్లి పెద్దల సమక్షంలో ఘనంగా జరిగింది.

సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు.గౌత‌మ్‌, మంజిమా… మూడేళ్లుగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే.

2019లో ‘దేవ‌ర‌ట్టం’ అనే సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్ టైంలోనే వీరి మధ్య పరిచయం ఏర్పడటం… తర్వాత అది ప్రేమగా మారడం జరిగింది.

‘మూడేళ్లుగా కష్టసుఖాల్లో మంజిమా నా వెన్నంటి నిలిచింది, క‌ఠిన ప‌రిస్థితుల్లో ధైర్యంగా ముంద‌డుగు వేసేలా త‌న‌లో ఆత్మ‌విశ్వాసాన్ని నింపింది.

తను నా ప‌క్క‌న ఉంటే ఏ అవ‌రోధానైన్నా ఎదుర్కోగ‌ల‌న‌నే న‌మ్మ‌కం నాకు కలిగింది’ అంటూ వీరి మధ్య ఉన్న ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టాడు గౌత‌మ్ కార్తిక్‌. 

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన కడలి మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

ఇక మంజిమా సాహసం శ్వాసగా సాగిపో చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

ఆ తర్వాత ఎన్టీఆర్ మహానాయకుడు మూవీలో కూడా ఈమె నటించింది.