లేడీ పవర్ స్టార్ షాకింగ్ డెసిషన్.. అసలు మేటర్ ఏంటి?

లేడీ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి… కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న రోల్స్ చేసేది. ఆ తర్వాత మలయాళంలో తెరకెక్కిన ‘ప్రేమమ్’ చిత్రంతో హీరోయిన్ గా మారింది.

ఆ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ‘ప్రేమమ్’ చిత్రం భారీ కలెక్షన్లు సాధించింది. ఆ ఒక్క సినిమాతో ఈమె సౌత్ మొత్తం ఫేమస్ అయిపోయింది.

ఆ తర్వాత తెలుగులో రూపొందిన ‘ఫిదా’ చిత్రం ఈమె తెలుగు, తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరచేసింది.

ఆ తర్వాత ఈమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఈమె గ్లామర్ షోకి చాలా దూరంగా ఉంటూ.. కదా ప్రాధాన్యత కలిగిన సినిమాలనే చేస్తూ వస్తుంది

గతేడాది ‘లవ్ స్టోరీ’ ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి చిత్రాలతో సూపర్ హిట్లు అందుకున్న సాయి పల్లవి..

ఈ ఏడాది ‘విరాట పర్వం’ ‘గార్గి’ వంటి చిత్రాల్లో నటించింది. ఇవి రెండు కూడా కమర్షియల్ ఫెయిల్యూర్స్ గా మిగిలాయి. అయితే ‘గార్గి’ తర్వాత ఈమె మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది లేదు.

నిజానికి సాయి పల్లవికి నటన పై ఆసక్తి లేదని. ప్రస్తుతం ఆమె డాక్టర్ కావాలనే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నట్టు టాక్ నడుస్తుంది.

ఈమె కొత్త కథలకు ఏమి ఓకే చెప్పలేదు. చాలామంది దర్శకనిర్మాతలు కథలు పట్టుకుని రెడీగా ఉన్నారు కానీ ఈమె దేనికి కూడా ఓకే చెప్పడం లేదు. అందులోనూ సాయి పల్లవి తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే.. ఏ కథని ఓకే చేయదు.

ఈమె కెరీర్లో రిజెక్ట్ చేసిన సినిమాల సంఖ్య చాలానే ఉంది. అలాగే ఎటువంటి వాణిజ్య ప్రకటనల్లో కూడా నటించదు.

డబ్బు కోసం తన మనస్సాక్షిని నమ్ముకుని ఏ సినిమా చేయదు. సినిమాల్లో అవకాశాలు లేకపోతే డాక్టర్ వృత్తిని కొనసాగిస్తాను అనే చాలా రోజుల క్రితం తెలిపిన సంగతి తెలిసిందే.

అయితే నిజంగానే సాయి పల్లవి సినిమాలకు గుడ్ బై చెప్పిందా? లేక వేరే కారణాల వల్ల ఇంకా ఏ సినిమాకి ఓకే చెప్పలేదా? అన్న విషయాలు తెలియాల్సి ఉంది.