Ram Charan: ఆ స్టార్ డైరెక్టర్ పై దృష్టి పెట్టిన చరణ్..?
June 7, 2021 / 08:19 PM IST
|Follow Us
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్లు ఉన్నా మెగాస్టార్ చిరంజీవి చరణ్ తొలి సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ పూరీ జగన్నాథ్ కు ఇచ్చిన సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ తన సినిమాలో హీరోను అద్భుతంగా చూపించడంతో పాటు హీరోతో అన్ని ఎమోషన్స్ ను అద్భుతంగా పండించగలరు. చిరుత సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ కాగా ఈ కాంబినేషన్ లో మరో సినిమా ఇప్పటివరకు రాలేదు. అయితే త్వరలో చరణ్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి.
చరణ్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్నట్టు అధికారిక ప్రకటన వెలువడినా భారతీయుడు2 సినిమా వివాదంలో చిక్కుకోవడంతో శంకర్ చరణ్ సినిమా షూటింగ్ కు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. చరణ్ ఇప్పటికే పలువురు స్టార్ డైరెక్టర్లతో చర్చలు జరపగా ఆ డైరెక్టర్లు వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. దీంతో రామ్ చరణ్ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ పై దృష్టి పెట్టారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో వేగంగా సినిమాలు తెరకెక్కించే దర్శకునిగా పూరీ జగన్నాథ్ కు పేరుంది.
ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ లైగర్ తో బిజీగా ఉన్న పూరీ జగన్నాథ్ తరువాత సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడలేదు. పూరీ జగన్నాథ్ స్వతహాగా రచయిత కావడంతో ఆయన దగ్గర స్క్రిప్ట్ లు కూడా సిద్ధంగా ఉంటాయి. పూరీ జగన్నాథ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కుతుందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. చరణ్ తరువాత సినిమాకు పూరీ జగన్నాథ్ డైరెక్టర్ గా ఓకే అయితే మాత్రం ఆ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కే అవకాశాలు అయితే ఉన్నాయి.