పాట కోసం కోటి..!

  • May 4, 2016 / 12:06 PM IST

ఈమధ్య మన సౌత్ సినిమాల నిర్మాతలు బడ్జెట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వడం లేదు. సన్నివేశానికి అవసరం అనుకొంటే ఎన్ని లక్షలు, కోట్లు ఖర్చు చేయడానికైనా వెనకాడట్లేదు. “సరినోడు” సినిమాలోని “ప్రైవేట్ పార్టీ, తెలుసా తెలుసా” పాటల చిత్రీకరణకు కోట్ల రూపాయలు ఖర్చు చేసిన విషయం తెలిసిందే.

ఇప్పుడు అదే రీతిలో.. సాయిధరమ్ తాజా చిత్రం “సుప్రీమ్” సినిమాలోని “అందం హిందోళం” పాట చిత్రీకరణ కోసం ఏకంగా కోటి రూపాయలు ఖర్చు చేసారట. చిరంజీవి సూపర్ హిట్ పాటల్లో ఒకటి కావడంతో.. ఆ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ఉండడం కోసం ఈ విధంగా భారీగా ఖర్చు చేసారట నిర్మాతలు. మరి ఇంత ఖర్చు పెట్టి తీసిన ఈ పాటను చూడాలంటే రేపటివరకూ ఆగాల్సిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బొద్దుగుమ్మ రాశిఖన్నా కథానాయికగా నటిస్తోంది!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus