విజయ్ దేవర కొండ, మహేష్ అంటే ఇష్టమన్న సషా

ఒకే ఒక్క యాడ్.. సషా జీవితాన్ని మార్చివేసింది. డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్)కు చెందిన సషా చెత్రీ ముంబయిలోని ‘క్సావియర్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్’లో అడ్వర్టయిజింగ్‌లో డిగ్రీ పూర్తి చేశాక ఓ ప్రకటనల సంస్థలో కాపీరైటర్‌గా చేరింది. ఎయిర్‌టెల్ 4జీ ప్రకటనల్లో నటించేందుకు ముంబయికి చెందిన ఓ యాడ్ ఏజెన్సీ ఆమెను ఎంపిక చేసింది. ఆ ప్రకటనలో నటించాక హీరోయిన్ స్థాయి క్రేజ్ సంపాదించుకుంది. సినీ అవకాశాలు సైతం తలుపుతట్టాయి. ఇమ్రాన్‌ ఖాన్‌, కంగనా రనౌత్ జంటగా నటించిన ‘కట్టీబట్టీ’ సినిమాలో సంగీతకారిణిగా కొద్దిసేపు కనిపించి అలరించింది. ఇప్పుడు తెలుగులోనూ అడుగుపెడుతోంది.

వినాయకుడు, విలేజిలో వినాయకుడు, కేరింత సినిమాలను డైరక్ట్ చేసిన సాయి కిరణ్ అడవి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో హీరోయిన్ గా ఎంపికయింది. అంతేకాదు ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించబోతోంది. ఈ సందర్భంగా సషా తెలుగులో తన అభిమాన హీరోల గురించి చెప్పింది. అర్జున్ రెడ్డి మూవీ భలే నచ్చిందని స్పష్టం చేసింది. ఆ సినిమాతోనే విజయ్ దేవరకొండ తన అభిమాన హీరో అయిపోయారని వెల్లడించింది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఇష్టమేనని సషా వివరించింది. 4జీ గర్ల్‌ నటించనున్న క్రేజీ మూవీలోని ఇతర ఆర్టిస్టుల గురించి త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus