లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj).. ఇప్పుడు సౌత్ లో ఉన్న పాన్ ఇండియా డైరెక్టర్స్ లో ఒకరు. ఓ మాస్ కథని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మిక్స్ చేసి చెప్పడం ఇతని స్టైల్. సందీప్ కిషన్ తో (Sundeep Kishan) ‘నగరం’ (Nagaram) అనే సినిమా చేసినప్పుడు ఇతన్ని జనాలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ‘ఖైదీ’ (Kaithi) చూసిన తర్వాత అందరూ ఒకింత షాక్ కు గురయ్యారు. ఎందుకంటే… ఒక మాస్ కథని… చాలా లేయర్స్ తో చాలా థ్రిల్లింగ్ గా తీశాడు లోకేష్.
ఇక క్లైమాక్స్ లో సీక్వెల్ కి ఇచ్చిన లీడ్ కూడా ఆడియన్స్ కి కొత్త ఫీలింగ్ ఇచ్చింది. స్టార్ హీరో విజయ్ సినిమాకి పోటీగా వచ్చినా.. ఇది వంద కోట్లు కొట్టింది అంటే కారణం అదే. దీంతో విజయ్ (Vijay Thalapathy) కూడా వెంటనే లోకేష్ ను పిలిచి ‘మాస్టర్’ (Master) ఛాన్స్ ఇచ్చాడు. ‘ఖైదీ’ తర్వాత లోకేష్ చేసిన సినిమాలు అన్నీ నిర్మాతలకి భారీ లాభాలు అందించాయి. లోకేష్ తో ఉన్న ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే..
ఎంత పెద్ద సినిమా చేస్తున్నా సరే.. దాన్ని ఫాస్ట్ గా తీయగలడు.., అలాగే బడ్జెట్ లెక్కలు కూడా శృతి మించకుండా తీయగలడు. ఈ పద్దతే స్టార్స్ ను అట్రాక్ట్ చేస్తుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ‘కూలి’ (Coolie) సినిమాలో హీరో రజినీకాంత్ తో (Rajinikanth) పాటు చాలా మంది స్టార్స్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ (Aamir Khan) కూడా చిన్న పాత్రలో కనిపించనున్నాడు.దీంతో నార్త్ లో కూడా ఈ సినిమాకి మంచి బిజినెస్ జరుగుతుంది.
ఇక ఈ సినిమా తర్వాత లోకేష్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు ఆమిర్ ఖాన్. ఈ విషయాన్ని స్వయంగా ఆమిర్ ఖాన్ (Aamir Khan) వెల్లడించారు. ‘లోకేష్ తనకు కూలితో పాటు ‘ఇరుంబుకై మాయావి’ అనే కథ కూడా చెప్పాడు. ఇదొక సూపర్ హీరో కథాంశంతో కూడిన సినిమా అని తెలుస్తుంది. అందులో కూడా ఆమిర్ ఖాన్ నటించబోతున్నాడట. 2026 కి ఆ ప్రాజెక్టు కూడా కంప్లీట్ అవుతుందని తెలిపాడు. ‘ఖైదీ 2’ తర్వాత ఆ ప్రాజెక్టు ఉంటుందని లోకేష్… ఆమిర్ కి చెప్పాడట.