రీఎంట్రీకి రెడీ అంటోన్న సీనియర్ హీరోయిన్!

  • October 26, 2020 / 04:15 PM IST

బెంగాలీ భామ రచనా బెనర్జీ ‘నేను ప్రేమిస్తున్నాను’ అనే సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. జేడీ చక్రవర్తి హీరోగా నటించిన ఈ సినిమాతో రచనాకి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి. మోహబాబు, జగపతిబాబు లాంటి అప్పటి స్టార్ హీరోల సరసన నటించి టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ అయింది. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే ఆమె కనుమరుగవ్వడం అందరినీ షాక్ కి గురి చేసింది.

ఆమె సినిమాలకు దూరం కావడానికి కారణం తనకున్న చెడు అలవాట్లే అని తెలుస్తోంది. హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో రచన మద్యం, సిగరెట్ లకు బానిసగా మారిందట. ఈ క్రమంలో ఆమెకి ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గాయి. దీంతో డిప్రెషన్ కి గురైంది. ఆమె పరిస్థితి గమనించిన కుటుంబసభ్యులు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. బెంగాలీ సినీ పరిశ్రమకు చెందిన ప్రోబల్ బసు అనే వ్యక్తితో రచనాకు పెళ్లి చేశారు.

ఆ తరువాత వైవాహిక జీవితంలో బిజీ కావడంతో పాటు ఇతర భాషల్లో అవకాశాలు రావడంతో చెడు అలవాట్లను పక్కన పెట్టి.. కుటుంబం, వర్క్ మీద ఫోకస్ పెట్టింది. తనకొక బిడ్డ జన్మించిన తరువాత కూడా ఆమె కొన్ని చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం టాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తోంది. నిజానికి రాశి, సంగీత, వాణి విశ్వనాధ్ లాంటి ఒకప్పటి హీరోయిన్లు ఇప్పుడు టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో రచనా కూడా తెలుగులో మంచి పాత్రలు వస్తే నటించడానికి సిద్ధమని చెబుతోంది.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus