అల్లు అర్జున్ పై పవన్ ఫ్యాన్స్ కోపాన్ని తగ్గించేందుకు అరవింద్ ప్రయత్నాలు

  • March 3, 2017 / 11:38 AM IST

సరైనోడు సమయంలో అల్లు అర్జున్ నోటి నుంచి వచ్చిన చెప్పను బ్రదర్ అనే మాట ఇప్పుడు పెద్ద గొడవకు దారి తీసింది. ఈ మాటతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కోపం తెప్పించిన బన్నీ.. ట్విట్టర్లో పవన్ ని ఫాలో కాకపోవడం మరింత ఆగ్రహానికి గురిచేసింది. దీంతో అల్లు అర్జున్ పరోక్షంగా నష్టాన్ని చవిచూస్తున్నారు. అతను హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించిన దువ్వాడ జగన్నాథం మూవీ టీజర్ కి అత్యధిక డిస్ లైక్ లు వచ్చాయి. అంతేకాదు మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గా విడిపోయి గొడవపడుతున్నారు. ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ బన్నీ పరువు తీస్తున్నారు.

ఈ గొడవని ఇంతటితో ఆపేందుకు అల్లు అరవింద్ రంగంలోకి దిగినట్లు సమాచారం. పవన్ కి బన్నీకి మధ్య విభేదాలు లేవని అభిమానులకు తెలియ చెప్పడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకు అరవింద్ చిరంజీవి, నాగబాబు సహకారం కూడా తీసుకుంటున్నట్లు ఫిల్మ్ నగర్ వాసులు చెబుతున్నారు. అందుకే డీజే లోని ఒక పాటను పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రిలీజ్ చేయించాలని అరవింద్ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి పవన్ మనసులో ఏముందో..!!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus