ఈగోక్లాష్ వల్లే సినిమా నుండీ తప్పుకుందట..!

  • June 28, 2019 / 01:35 PM IST

టాలీవుడ్లో రాంచరణ్,అల్లు అర్జున్, నాగచైతన్య, నాని వంటి క్రేజీ హీరోలందరి సరసన నటించినప్పటికీ సరైన క్రేజ్ ను మాత్రం సంపాదించుకోలేకపోయింది. దీంతో ఇక్కడ అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఇక ఏ.ఎల్.విజయ్ తో వివాహం అయ్యాక సినిమాలకి మరింత దూరమైంది. అయితే విజయ్ తో విడాకులు తీసుకున్నాక మళ్ళీ తమిళంలో అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా ఉంది. ఇప్పటికే ‘రచ్చాసన్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో తిరిగి ఫామ్లోకి వచ్చింది. ఈ క్రమంలో విజయ్ సేతుపతి వంటి స్టార్ హీరో చిత్రంలో అమలా పాల్ కు ఆఫర్ వచ్చింది. అయితే ఆ తరువాత ఆమె స్థానంలో మేఘా ఆకాశ్ ను తీసుకున్నారు. ఈ విషయం రకరకాలుగా ప్రచారం జరిగింది. నిర్మాతలతో చీటికీ మాటికీ గొడవలు పెట్టుకుంటుందని …. ఆమె ఎంత మాత్రం సహకరించిందని రెమ్యునరేషన్ విషయంలో కొంచెం తేడా వచ్చినా గోల గోల చేస్తుందని’ కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరిగింది.

ఫైనల్ గా అమలా పాల్ ఈ విషయం పై క్లారిటీ ఇచ్చింది. “గతంలో కొందరు నిర్మాతలు అడ్వాన్స్ ఇచ్చి సగం రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా నేను వర్క్ చేశాను. షూటింగ్ స్పాట్ లో వసతులు లేకపోయినా అడ్జస్ట్ చేసుకున్నా. సినిమా కోసం డేట్స్ లెక్కచేయకుండా పని చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సినిమా కోసం ఏమైనా చేస్తాను. అలాంటిది నేను అతిగా ప్రవర్తిస్తాను అనడంలో నిజం లేదు. విజయ్ సేతుపతి సినిమాలో నుంచి నన్ను తీసేయడానికి ప్రధాన కారణం నిర్మాతలతో ఏర్పడిన ఈగో క్లాష్” అంటూ అమల చెప్పుకొచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus