మరో మంచి ఛాన్స్ అందుకున్న అనుపమ పరమేశ్వరన్

Advertisement

మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ “అ ఆ” సినిమాతో అడుగుపెట్టి.. అచ్చమైన తెలుగు ఆడపడుచు అని పేరు తెచ్చుకుంది. ప్రేమమ్ తో మ్యాజిక్ చేసి కుర్రకారుకి నిద్రలేకుండా చేసింది. శతమానం భవతి, ఉన్నదీ ఒకటే జిందగీ లోను నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు మెగా హీరో సాయిధరమ్ తేజ్ కి జోడీగా నటిస్తోంది. కరుణా కరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న “తేజ్ ఐ లవ్ యు” మూవీ టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయి మంచి స్పందన అందుకుంది. వెండితెరపై జోడీ బాగా సెట్ అయిందని చూసిన వారందరూ చెప్పుకుంటున్నారు.

ఈ చిత్రంతో సాయి ధరమ్ తేజ్ హిట్ ట్రాక్ లోకి వస్తారని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ఆమెని తన నెక్స్ట్ సినిమాకి ప్రిఫర్ చేస్తున్నారు. “తేజ్ ఐ లవ్ యు” తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో తేజ్ మూవీ చేయనున్నాడు. అందులోనూ అనుపమని ప్రధాన హీరోయిన్ గా తీసుకున్నారు. రెండో హీరోయిన్ గా కల్యాణి ప్రియదర్శన్ సెలక్ట్ అయింది. కిషోర్ తిరుమల చెప్పిన కథ, అందులో తన పాత్ర బాగుండడంతో ఈ చిత్రానికి సైన్ చేసినట్లు అనుపమ వెల్లడించింది. విభిన్నమైన కథతో తెరకెక్కనున్న మూవీ తనకి మంచి పేరు తీసుకొస్తుందని నమ్మకంతో ఉంది. ఈ రెండు చిత్రాలు హిట్ అయితే సాయి ధరమ్ తేజ్, అనుపమ హిట్ పెయిర్ గా పేరు అందుకుంటారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus