తెలుగు రాష్ట్రాల్లో 300 కోట్లు వసూలు చేసిన బాహుబలి కంక్లూజన్

  • May 31, 2017 / 01:41 PM IST

ఎస్.ఎస్.రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కిన బాహుబలి కంక్లూజన్ విడుదలై నెల రోజులు అవుతున్నా చూసేవారి సంఖ్య తగ్గడం లేదు. ఏప్రిల్ 28 న నాలుగు భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ అన్ని ఏరియాల్లో కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. పది రోజుల్లో 1000 కోట్ల గ్రాస్ వసూలు చేసి భారతీయ సినీ చరిత్రలో ఈ మార్క్ దాటిన తొలి మూవీగా రికార్డుల్లోకి ఎక్కింది. ప్రపంచ వ్యాప్తంగా 1600 కోట్లు రాబట్టిన ఈ కళా ఖండం తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా కలెక్షన్లు రాబడుతోంది.

తాజాగా ట్రేడ్ సమాచారం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 33 రోజులకు కలిపి 301 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేసింది. షేర్ కూడా భారీగానే వచ్చినట్లు సమాచారం. వారం రోజులలోనే డిస్ట్రిబ్యూటర్లు కొన్న మొత్తం చేతికొచ్చింది. రెండు వారాలుగా లాభాలను అందుకుంటున్నారు. ఈ వసూళ్ల తాకిడి మరో 10 రోజుల పాటు ఉండవచ్చని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus