మరో మంచి అవకాశం దక్కించుకొన్న భూమిక!

Ad not loaded.

“సిద్ధూ నువ్ నా నడుము చూశావ్.. అది నేను చూశాను” అంటూ కోపంతో కూడిన చిరాకుతో పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించిన భూమికను ఇంకా ఎవరూ మరువక ముందే.. “మిడిల్ క్లాస్ అబ్బాయి” అబ్బాయిలో బాధ్యతగల వదినమ్మగా దర్శనమిచ్చింది భూమిక. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీయార్, వెంకటేష్, చిరంజీవి వంటి అగ్ర కథానాయకులందరి సరసన నటించిన భూమిక కొన్నాళ్లు బ్రేక్ తీసుకొని “మిడిల్ క్లాస్ అబ్బాయి”తో రీఎంట్రీ ఇచ్చింది. భూమిక పోషించిన ముఖ్యభూమికకు విశేషమైన స్పందన లభించడంతో అమ్మడికి మళ్ళీ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయ్.

తాజాగా నాగాచైతన్య కథానాయకుడిగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సవ్యసాచి” చిత్రంలో భూమికను ఓ కీలకపాత్ర కోసం అడగ్గా.. పాత్ర నచ్చడంతో ఇమ్మీడియట్ గా సైన్ చేసిందట భూమిక. ఆమె పాత్ర ఏమిటనేది ప్రస్తుతం తెలియకపోయినప్పటికీ.. నాగార్జున సరసన “స్నేహామంటే ఇదేరా” చిత్రంలో కథానాయికగా నటించిన భూమిక ఇప్పుడు నాగచైతన్య సినిమాలో నటించనుండడంతో కాంబినేషన్ హైలైట్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus