బిగ్ బాస్ 4: నైబర్ హౌస్ వాళ్ళు బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చాక…!

  • September 16, 2020 / 01:52 PM IST

బిగ్ బాస్ లో గొడవ లేకపోతే అసలు ఎందుకు ఈ షో అనిపిస్తుందేమో… అందుకే బిగ్ బాస్ నాలుగో సీజన్ లో గొడవలు మొదలు పెట్టేశారు. అసలు దీనికి బీజం లాంచింగ్ ఎపిసోడ్ లోనే పడింది. సోహెల్ , ఆరియానాని నైబర్ హౌస్ లో పెట్టినప్పుడే ఇదంతా గొడవలు సృష్టించడానికే బిగ్ బాస్ చేస్తున్న పని అని అందరికీ అర్థమైంది. రెండో రోజు రాత్రి వారిద్దరిని బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళమని అప్పుడే ఈ విషయంలో క్లారిటీ వచ్చింది. ఎప్పుడు తర్వాత ఇచ్చిన చిన్న ప్రోమోలో కూడా చూపించారు.

తొలిరోజు నైబర్ హౌస్ లో ఉన్న వాళ్లకి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్ళు భోజనం పెట్టారు. దానివల్ల హౌస్ లో చిన్న డిస్టబెన్స్ కూడా వచ్చింది. అయితే రెండో రోజు నైబర్ హౌస్ వాళ్ళ పప్పులు ఉడక లేదు. ఆరియనా ఫోన్ చేసి మరి ఫుడ్ గురించి మాట్లాడితే అఖిల్ పులిహోర కలిపాడు గాని ఫుడ్ పెట్టలేదు. దానికి తోడు నోయల్ ఫోన్ తీసుకొని నాలుగు పంచ్ డైలాగ్ లు వేసి ఫోన్ కట్ చేసాడు. దీంతో నైబర్ హౌస్ టీం ఆకలితో ఉంది. దీనిని గమనించిన బిగ్ బాస్ మీరే వెళ్ళి తేల్చుకోండి అన్నాడు. ఇక్కడి వరకు అందరికీ తెలిసిందే. మరి వాళ్ళిద్దరు బిగ్ బాస్ హౌస్ ఇంట్లోకి వచ్చి ఏం చేశారో మూడో రోజు తెలుస్తుంది.

తాజాగా రిలీజ్ అయిన ప్రోమో బట్టి ఈ విషయం లో పెద్ద గొడవ అయినట్టు అర్థమవుతోంది. మాటలతో మొదలైన డిస్కషన్ ఎక్కడికి పోయింది. అఖిల్, నోయల్, సోహైల్ డిస్కషన్ ని హీటెక్కించారు. నువ్వెంత అంటే నువ్వెంత వరకు తీసుకెళ్లారు. వాయిస్ రైజ్ చేయొద్దని ఒకరు, నేను అరవగలను అంటూ ఇంకొకరు మాటల యుద్ధం పెంచారు. ప్రోమోను చూస్తుంటే ఈ గొడవ పెద్దది అయ్యేలా ఉంది. ఇక్కడ తప్పు… ఎవరిది అన్న విషయం పక్కన పెడితే ఈరోజు రాత్రి ఎపిసోడ్ లో మాత్రం ఎమోషన్, డ్రామా, ఫన్ గట్టిగానే వచ్చినట్టుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus