సవ్యసాచి గురించి డైరక్టర్ చందూ మొండేటి ఆసక్తికర కామెంట్

  • May 16, 2018 / 12:36 PM IST

యువ దర్శకుడు చందూ మొండేటి యువహీరో నిఖిల్ తో “కార్తికేయ” అనే థ్రిల్లర్ మూవీని తెరకెక్కించి మంచి విజయం సాధించారు. తర్వాత “ప్రేమమ్’ మలయాళ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో నాగచైతన్యతో రీమేక్ చేసి మరో హిట్టు అందుకున్నారు. తాజాగా నాగచైతన్యతో యాక్షన్ జానర్‌లో “సవ్యసాచి” డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. మాధవన్‌, భూమిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం అమెరికాలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చందు సినిమా గురించి అనేక విషయాలు చెప్పారు.

“ప్రేమమ్ సినిమాకి ఈ చిత్రానికి నాగ చైతన్య చాలా డెవలప్ అయ్యారు. అన్ని రకాలుగా ఆ మార్పు కనిపిస్తుంది. ఇంత చేంజ్ వస్తుందని అనుకోలేదు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో అదరగొట్టారు. సవ్యసాచి చైతూని మరో లెవెల్ కి తీసుకుపోతుంది” అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ “తెలుగు సినిమాల్లో చూపించని అమెరికాలోని ప్రాంతాల్లో సవ్యసాచి షూట్ చేస్తున్నాం. దాదాపు చిత్రీకరణ పూర్తికావచ్చింది. ఇక్కడకి సన్నివేశాలు మాత్రమే కాకుండా.. సినిమా మొత్తం అనుకున్నదానికంటే బాగా వచ్చింది. ఆడియన్స్ కి కొత్త అనుభూతిని ఇస్తుంది” అని చందూ వివరించారు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus