పూరి జగన్నాథ్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణం ఛార్మీనా ?

  • July 11, 2017 / 02:02 PM IST

బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న జై లవకుశ టీజర్ రిలీజ్ అయిన తర్వాత అభినందనలు వెల్లువెత్తాయి. తారక్ నటన సూపర్ అంటూ దర్శకులు, నటీ నటులు, అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసించారు. ఇది ఒక వైపు మాత్రమే.. మరో వైపు ఈ కథ పూరి జగన్నాథ్ చెబితే.. బాబీ కాపీ కొట్టారని ప్రచారం జోరుగా సాగుతోంది. బాబీ ఇది తన రాసుకున్న కథని మొదటి నుంచి చెప్పుకొస్తున్నప్పటికీ ఈ రూమర్ రావడం షాక్ ని కలిగించింది. ఎన్టీఆర్ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించింది. అసలు ఈ రూమర్ ఎవరు సృష్టించారు ? అని అరా తీయగా ఛార్మి అని తెలియడంతో ఆమెపై ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు.

ఈ గొడవలోకి ఆమె ఎందుకు వచ్చింది? అనే కదా మీ ప్రశ్న.. ఆ విషయంలోకి వెళ్తే.. బాలకృష్ణ తో ‘పైసా వసూల్’ సెట్లో ఉన్న పూరీ జగన్నాథ్ ‘జై’ టీజర్ చూశాక… ఇలాంటి నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ గురించి తాను ఇదివరకే ఎన్టీఆర్‌తో చెప్పానని, అయితే అప్పుడు ఎన్టీఆర్ ఏ విషయమూ చెప్పలేదని పూరీ జగన్నాథ్ బాలయ్యతో అన్నారంటా. ఆ సమయంలో ఛార్మి పక్కనే ఉందంట. సో ఆ విషయాన్ని ఆమె స్నేహితులతో చెప్పడంతో వైరల్ అయింది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో పూరి, ఛార్మి క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus