చిరు పై ఆమెకు అసహనం….కారణం??

  • April 8, 2017 / 01:21 PM IST

బ్రహ్మానందం….ఈయన పేరు చెబితేనే…ఆకస్మాతుగా నవ్వు మొదలు పెడతారు…ఇక ఈయన తెరపై కనపడితే…ఇక నవ్వుల పువ్వలకు ఏమాత్రం డోకా ఉండదు…ఇదిలా ఉంటే బ్రహ్మానందం టాలీవుడ్ లో అడుగు పెట్టి ఎన్నో ఏళ్లు గడచినా…ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసినా…ఆయన కరియర్ ఇప్పటికీ జెడ్ స్పీడ్ లో దూసుకుపోతుంది అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు…ఇదిలా ఉంటే ఇప్పుడు బ్రహ్మి టాలీవుడ్ లో టాక్ గా మారాడు…అనుకోకుండా మాట్లాడిన కొన్ని మాటల వల్ల దాదాపుగా టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ హాట్ గా చర్చించుకునే దిశగా మారాడు..ఇంతకీ మ్యాటర్ ఏంటి….అంటే……మెగా స్టార్ చిరంజీవి నిర్వహిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోలో అతిధిగా వచ్చిన బ్రహ్మానందం అనుకోకుండా జంధ్యాల పై చేసిన కామెంట్స్ ఈ చిచ్చు రగిల్చినట్లు తెలుస్తోంది. జంధ్యాలకు ఉన్న కొన్ని అలవాట్లు వల్ల జంధ్యాల చిన్నతనంలోనే మరణించాడు అంటూ బ్రహ్మీ జంధ్యాల వ్యక్తిగత జీవితం పై చేసిన జంధ్యాల సతీమణి రాణి దృష్టికి రావడంతో ఆమె బ్రహ్మానందం కి ఫోన్ చేసి పెద్ద క్లాస్ పీకినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి.

ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా తెలుగు సినీ పరిశ్రమలో బ్రహ్మానందానికి కామెడీ కరియర్ ను అందించిన ఆయన గురువు జంధ్యాల పై ఇలాంటి అనాలోచిత కామెంట్స్ ఎందుకు చేసాడో ఎవరికీ అర్ధం కాని విషయంగా మారింది. అంతేకాదు ఈ విషయమై జంధ్యాల భార్య చిరంజీవికి కూడ తన అసహనాన్ని తెలిపినట్లు గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. అయితే వారి మధ్య జరిగిన ఆ సంభాషణ అసలు బయటకు ఎలా వచ్చిందో…అందులో నిజం ఎంత ఉందో తెలీదు కానీ….మొత్తంగా అయితే అటు చిరు…ఇటు బ్రహ్మీపై జంధ్యాల సతీమణి చాలా అసహనంగా ఉన్నట్లు మాత్రం ఇప్పుడు టాలీవుడ్ టాక్ ఆఫ్ థ టౌన్ గా మారడం గమనార్హం.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus