గుర్రపు స్వారీ, మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటున్న చిరు!

  • April 12, 2017 / 02:32 PM IST

స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి 1840 లో బ్రిటిష్ వారికి ఎదురు నిలిచి పోరాడి వీరమరణం పొందారు. అంతటి వీరుడి జీవిత గాథలో మెగాస్టార్ చిరంజీవి నటించడానికి సిద్ధమవుతున్నారు. స్టైలిష్ డైరక్టర్ సురేందర్ రెడ్డి, ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్ తో కలిసి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేశారు. ఆ స్క్రిప్ట్ మెగాస్టార్ కి నచ్చడంతో దానిని లాక్ చేశారు. ఇప్పుడు డైరక్టర్ లొకేషన్ వేటలో పడ్డారు. చిరు మాత్రం గుర్రపు స్వారీ, కత్తి యుద్ధాలపై దృష్టి పెట్టారు. గుర్రపు స్వారీలో మెగాస్టార్ కి బాగా పట్టుంది.

అయినా పర్ఫెక్ట్ గా రావాలని ప్రతిరోజూ హైదరాబాద్ రేస్ కోర్స్ కు వెళుతున్నట్లు తెలిసింది. ఈ నెలాఖరు నుంచి మార్షల్ ఆర్ట్స్ లోను శిక్షణ తీసుకోనున్నట్లు సమాచారం.  హిస్టారికల్ మూవీలో హీరోయిన్ గా శృతిహాసన్ నటించనుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మాత రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి  మగధీర, బాహుబలి కి గ్రాఫిక్స్ హంగులు అందించిన కనల్ కణ్ణన్  ని గ్రాఫిక్ హంగులు జోడించనున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus