సూర్యతో కబాలి దర్శకుడికి చెడిందా..?

  • September 7, 2016 / 07:29 AM IST

రెండంటే రెండు సినిమాలతో సూపర్ స్టార్ రజనీని డైరెక్ట్ చేసే అవకాశాన్ని పట్టేశాడు పా.రంజిత్. ‘కబాలి’ పేరుతో భారీ అంచనాల మధ్య విడుదలను విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందనతో సరిపుచ్చుకుంది. అయితే రజనీ కంటే ముందు సూర్యతో సినిమా చేయాల్సివుంది. ఈ విషయాన్ని దర్శకుడు సైతం ధృవీకరించాడు. కబాలి తర్వాత ఆ సినిమా ఉంటుందన్న ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఎవరి దారి వారిదే అన్నట్టుంది.

‘కబాలి’ ఫలితంతో నిమిత్తం లేకుండా రంజిత్ కు మరో అవకాశమిచ్చారు రజనీకాంత్. పైగా ఈ చిత్రాన్ని నిర్మించేందుకు రజని అల్లుడు తమిళ స్టార్ హీరో అయిన ధనుష్ ముందుకొచ్చాడు. రజనీ ప్రస్తుతం చేస్తోన్న ‘రోబో 2’ పూర్తి కాగానే ఈ సినిమా మొదలెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు సూర్య కూడా తన కొత్త సినిమాని ప్రకటించేశాడు. నయనతారతో నానుమ్ రౌడీదాన్ (తెలుగులో నేనూ రౌడీనే) చేసిన విగ్నేష్ శివన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. అనిరుధ్ సంగీతం అందించనున్న ఈ సినిమాని స్టూడియో గ్రీన్ సంస్థతో కలిసి సూర్య నిర్మించనున్నాడు. సూర్య, రంజిత్ ఇలా “ఎవరికి వారే” అన్నట్టు మెలగడానికి కాలమే కారణమా.. లేక ఇద్దరికీ ఏదైనా విషయంలో చెడిందా? అన్నది తెలియాల్సివుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus