శంకర్ శిష్యుడు ఇక లేడు..!

  • May 16, 2020 / 12:54 PM IST

తాను డైరెక్ట్ చేసిన మొదటి సినిమా విడుదల కాకుండానే అరుణ్ ప్రశాంత్ అలియాస్ వెంకట్ పక్కర్ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దూరమైపోయినట్టు తెలుస్తుంది. ఈ సంఘటన తో కోలీవుడ్ చిత్ర పరిశ్రమ అంతా విషాదంతో నిండిపోయింది. అరుణ్ కోయంబత్తూర్లోని మెట్టుపాళ్యం ప్రదేశంలో ద్విచక్ర వాహనం పై వెళ్తుండగా లారీ ఢీ కొట్టింది. దీంతో తీవ్రంగా గాయాలు పాలైన ఆయన తుది శ్వాస విడిచినట్టు తెలుస్తుంది.

కొంతమంది సినీ ప్రముఖులు… ఆయన ఇక లేడు అన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రముఖ స్టార్ డైరెక్టర్ శంకర్ దగ్గర అరుణ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఆయన డైరెక్టర్ గా పరిచయం కాబోతున్న ‘4G’ చిత్రం త్వరలో విడుదల కావాల్సి ఉంది. జీవీ ప్రకాశ్ ఈ చిత్రంలో హీరోగా నటించాడు. గాయత్రి సురేష్, కీలక పాత్ర పోషించింది. ‘తిరుకుమారన్ ఎంటర్మెంట్స్’ ఈ చిత్రాన్ని నిర్మించింది. 2016 నవంబరు హైదరాబాద్ లో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.

2017లో షూటింగ్ పూర్తయ్యింది.కానీ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇక అరుణ్ ఇక లేదు అన్న విషయం పై జీవీ ప్రకాష్ కుమార్ తన ఆవేదన చేసాడు. ‘నా స్నేహితుడు, నేనెంతో ప్రేమించే వ్యక్తి.. నా దర్శకుడు వెంకట్ పక్కర్ ఇలా రోడ్డు ప్రమాదానికి గురయ్యి దూరమైపోయాడు అని తెలిసి నేను చాలా బాద పడ్డాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video
z
దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus