డబల్ వినోదాన్ని అందించనున్న మల్టీ స్టారర్ సినిమాలు

గత ఏడాది విభిన్న కథలతో తెలుగు చిత్ర పరిశ్రమకి అనేక విజయాలను తెచ్చి పెట్టిన దర్శకులు.. ఈ సంవత్సరం ప్రేక్షకులకు డబల్ వినోదాన్ని అందించనున్నారు. మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. బాహుబలి తో తెలుగు వారి ప్రతిభని ప్రపంచానికి చాటిన రాజమౌళి మెగా నందమూరి కాంబినేషన్ ని సెట్ జేశారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ తో ఓ ఫ్యామిలీ డ్రామాని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. నాగార్జున, కార్తీ లతో ఊపిరి తీసి హిట్ అందుకున్న వంశీ పైడిపల్లి ఈ సారి మహేష్ బాబు, అల్లరి నరేష్ లను కలిపి సినిమా తీయబోతున్నారు. భరత్ అనే నేను సినిమా తర్వాత ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.

దువ్వాడ జగన్నాథం సినిమాతో హడావుడి చేసిన హరీష్ శంకర్ యువ హీరోలు నితిన్, శర్వానంద్ లతో ఓ మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారు. అలాగే అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ లతో ఎఫ్2 మూవీ చేయనున్నారు. భలే మంచి రోజు, శమంతకమణి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ ఆదిత్య మల్టీ స్టారర్ కథని రెడీ చేశారు. ఇందులో నాగార్జున, నాని నటించనున్నట్లు తెలిసింది. వీటితో పాటు అల్లరి నరేష్, సునీల్ కలిసి ఓ సినిమాలో అల్లరి చేసేందుకు రెడీ అయిపోతున్నట్లు సమాచారం. ఇలా ఈ ఏడాది మొత్తం హీరోలు కలిసి వచ్చి వినోదం పంచనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus