టాలీవుడ్ డైరక్టర్స్ పై సంచలన కామెంట్స్ చేసిన హేమ

  • March 18, 2017 / 12:08 PM IST

సహాయ పాత్రల్లో చక్కగా నటిస్తూ పేరు తెచ్చుకున్న నటి హేమ. అతడు సినిమాలో బ్రహ్మనందం భార్యగా నవ్వులు పూయించిన ఈమె తర్వాత అనేక సినిమాల్లో కన్నీరు తెప్పించే పాత్రలు పోషించింది. కుమారి 21 ఎఫ్ లో హీరో తల్లిగా మెప్పించింది. తాజాగా హేమ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమాలో ఛాన్స్ ఇవ్వాలంటే డైరక్టర్లు లేడీస్ నుంచి ఇంకేదో ఆశిస్తున్నారనే వార్తలను ఖండించింది.  ” మన దర్శకులు తెలుగు వారిని కాకుండా ఇతర భాషా వారికి ప్రాధాన్యం ఇస్తున్నారనేది వాస్తవం. మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన పూరి జగన్నాథ్ కూడా పక్క రాష్ట్రాల నుంచి ఆర్టిస్టులను తెచ్చుకుంటున్నారు. అది మమ్మల్ని బాధకు గురిచేస్తోంది” అని ఆవేదన వ్యక్తం చేసింది.

ఆ విషయంలో డైరెక్టర్లను తప్పు పట్టవచ్చుకానీ, నటీమణులతో శారీరక సంభంధం కోసం పాకులాడుతున్నారని చెప్పడంలో ఏ మాత్రం నిజం లేదని వెల్లడించింది. టాలీవుడ్ లో అలాంటి పనులు జరుగుతుంటే ఎవరూ తమ పిల్లలని సినిమాలోకి పంపించరని హేమ స్పష్టం చేసింది. తనకి జూనియర్ ఎన్టీఆర్ కి తల్లిగా నటించాలని ఉందని మనసులో మాటను బయటపెట్టింది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus