అదే సెంటిమెంట్ ను మళ్ళీ ఫాలో అవుతున్న రామ్..!

  • October 17, 2019 / 09:31 PM IST

‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు రామ్. ఈ చిత్రంతో మాస్ లో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్నాడు రామ్. ఇక ఇదే జోష్ లో తన తదుపరి సినిమాని మొదలు పెట్టబోతున్నాడు. తనకు ‘నేను శైలజ’ వంటి హిట్ ఇచ్చిన కిశోర్ తిరుమల డైరెక్షన్లోనే రామ్ తన తరువాతి సినిమాని చేయబోతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో ‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రం కూడా వచ్చింది. అయితే ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదనే చెప్పాలి. దీంతో ఈసారి ఎలా అయినా పెద్ద హిట్టు కొట్టాలనే కసితో ఈ సారి సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.

తమిళంలో సూపర్ హిట్టైన ‘తడం’ అనే చిత్రాన్ని వీరు రీమేక్ చేయబోతున్నారట. ఇక ‘ఇస్మార్ట్ శంకర్’ లో ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేసాడు రామ్. ఇప్పుడు కిశోర్ తిరుమల డైరెక్షన్లో చేయబోతున్న చిత్రంలో కూడా ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నారట. ‘ఇస్మార్ట్’ సెటిమెంట్ నే మళ్ళీ రిపీట్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఇక ఆ ఇద్దరు హీరోయిన్లలో నివేదా పేతురాజ్ ఒకరు కాగా.. మరొకరు మాళవికా శర్మ అని తెలుస్తుంది. మరి ఈ వార్తలో ఎంతవరకూ నిజముందో అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచిచూడాల్సి ఉంది.

బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus