హీరోలకు సూటయ్యే కథానాయికల కోసం గాలిస్తున్న దర్శకులు

  • July 8, 2017 / 02:23 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ కొరత లేకపోయినప్పటికీ ప్రస్తుతం హీరోయిన్ల్ వేట కొనసాగుతోంది. చిరంజీవి ప్రస్తుతం తన 151వ సినిమా పనుల్లో ఉన్నారు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథను తెరకెక్కించడానికి డైరక్టర్ సురేందర్‌రెడ్డి అంతా సిద్ధం చేశారు. హీరోయిన్ విషయంలో ఆలోచిస్తున్నారు. ఐశ్వర్యరాయ్‌, సోనాక్షి సిన్హా, అనుష్క వంటి పేర్లు వినిపిస్తున్నాయి తప్ప అధికారిక ప్రకటన రాలేదు. బాహుబలి కంక్లూజన్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ కి హీరోయిన్ కష్టాలు తప్పడం లేదు. ఓసారి కన్నడ బ్యూటీ, మరో సారి బాలీవుడ్ సుందరి అంటూ చిత్ర బృందం రోజుకో మాట చెబుతోంది. కానీ ఇంకా ఎవరూ ఫైనల్ కాలేదు.

డీజే తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న ‘నాపేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ లో కథా నాయిక ఎవరన్న విషయంలో ఎలాంటి సమాచారం లేదు. బన్నీ కోసం కొత్తమ్మాయిల పేర్లు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఇక అఖిల్‌, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా రెండో షెడ్యూల్ కూడా పూర్తి చేసుకోబోతోంది అయినప్పటికీ హీరోయిన్ ని ఫైనల్ చేయడం లేదు. అలియా బట్, జాహ్నవి, మలయాళ డైరక్టర్ ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి ని కూడా చిత్ర బృందం సంప్రదించినట్లు తెలుస్తోంది. కానీ ఎవరూ ఒకే కాలేదు. ఇలా మరికొంతమంది దర్శకులు హీరోయిన్స్ వెతికే పనిలో ఉన్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus