ఆశ్చర్యపోయే సమాధానం చెప్పిన బాలీవుడ్ హీరోయిన్!

  • October 4, 2018 / 10:10 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చేయకముందు తెలుగువారికి మాత్రమే కలల రాకుమారుడు. ఆ సినిమా తర్వాత భాష బేధం లేకుండా దేశవ్యాప్తంగా అతనంటే ఇష్టపడేవారి సంఖ్య పెరిగింది. సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు సైతం ప్రభాస్ తో ఒక్క సెల్ఫీ కోసం ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్స్ అయితే అతనితో కలిసి నటించాలని ఆశపడుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సాహో మూవీ హీరోయిన్ గా నటించడానికి శ్రద్ధ కపూర్ అనేకమందితో పోటీపడి సొంతం చేసుకుంది. అందుకే ఇప్పుడు ప్రభాస్ అంటే తెలియని బాలీవుడ్ హీరోయిన్ లేదు. కానీ ‘లవ్ యాత్రి’లో నటించిన హీరోయిన్ కి మాత్రం ప్రభాస్ తెలియదంట.

సల్మాన్ ఖాన్ సొంత బ్యానర్‌లో నిర్మితమైన ఈ సినిమాలో ఆయుష్ శర్మ, వరీన్ హుస్సేన్ లు హీరో హీరోయిన్స్ గా నటించారు.  ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా  హైదరాబాద్ వచ్చిన వీరిని మీడియా పలకరించింది. హీరోయిన్ వరీన్ హుస్సేన్ ని ప్రభాస్ గురించి అడగ్గా బిక్కమొహం వేసింది. దీంతో హీరో ఆయుష్ శర్మ అందుకొని ఆమె ఆఫ్ఘనిస్తాన్ అమ్మాయని… తనకు ప్రభాస్ తెలియదని.. ఆమె  తరఫున క్షమాపణలు చెప్పారు. అప్పుడే ప్రభాస్ గురించి తెలుసుకున్న ఆమె.. కలలో ఎవరిని హగ్ చేసుకోవాలనుకుంటున్నావు? అని అడిగితే వెంటనే ప్రభాస్ పేరు చెప్పి ఆశ్చర్యపరిచింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus