జయంత్‌ సి.పరాన్జీ ని ప్రేమ కథ రాయమని కోరిన మహేష్!

  • May 28, 2017 / 08:31 AM IST

ప్రేమ కథ చిత్రాల్లో ట్రెండ్ సృష్టించిన సినిమా ‘ప్రేమించుకుందాం రా’. దీని తర్వాత రాయలసీమ నేపథ్యంలో అనేక ప్రేమకథ చిత్రాలు పుట్టుకొచ్చాయి. అలాగే  ‘ప్రేమంటే ఇదేరా’, ‘బావగారూ బాగున్నారా’ వంటి సినిమాలతో విజయాలు అందుకున్న జయంత్‌ సి.పరాన్జీ కి అపజయాలు పలకరించడంతో సినిమాలకు దూరమయ్యారు. చాలాకాలం తర్వాత  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవిని హీరోగా పరిచయం చేస్తూ ‘జయదేవ్‌’ను తెరకెక్కించారు. ఈ మూవీ వచ్చే నెలలో విడుదల కానుంది. ఈ సందర్భంగా అయన మీడియాతో మాట్లాడుతూ మహేష్ బాబు తో తనకి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. వీరిద్దరి కలయికలో టక్కరిదొంగ సినిమా వచ్చింది.

ఈ చిత్రాన్ని స్వయంగా జయంత్ నిర్మించారు. ఆ మూవీ గురించి ప్రస్తావిస్తూ “‘టక్కరిదొంగ’కోసం మహేష్‌బాబు ఏడాదిన్నర కష్టపడి పనిచేశాడు. అయినా ఒక్క పైసా కూడా తీసుకోలేదు. ఆ విషయంలో మహేష్‌కి హేట్సాఫ్‌” అని చెప్పారు. ఇక మళ్లీ మీ కలయికలో సినిమా ఎప్పుడని అడగగా.. “నేను మహేష్ కలిసి తప్పకుండా సినిమా చేస్తాం. ఆయన కోసం మంచి కమర్షియల్ మూవీ కథని రెడీ చేశా. అయితే మహేష్ మాత్రం లవ్ స్టోరీ కావాలని కోరుతున్నారు. అక్కడే లేట్ అవుతోంది” అని వివరించారు. మహేష్, జయంత్ కలయికలో ప్రేమకథా చిత్రం వస్తే ట్రెండ్ సృష్టించడం ఖాయం.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus