నో చెప్పిన కాజల్

  • June 22, 2016 / 02:09 PM IST

టాలీవుడ్ లో కొంతకాలంగా నంబర్ హీరోయిన్ గా వెలిగిన తార కాజల్ అగర్వాల్. లక్ష్మి కల్యాణం చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ ముంబై సుందరి మగధీర తో ఫామ్లోకి వచ్చింది. ఆ చిత్ర హీరో రామ్ చరణ్ తో నాయక్, గోవిందుడు అందరి వాడేలే సినిమాల్లో జంటగా నటించి మెప్పించింది.

ఇతర తెలుగు హీరోలతోనూ హిట్ అందుకుంది. కానీ ఈ ఏడాది విడుదలైన ఆమె చిత్రాలు సర్దార్ గబ్బర్ సింగ్ , బ్రహ్మోత్సవం పూర్తిగా నిరాశ పరిచాయి. బాలీవుడ్ సినిమా దో లాఫ్జోన్ కి కహాని కూడా ఆమెను ఆదుకోలేక పోయింది. దీంతో తన హిట్ హీరో రామ్ చరణ్ లేటెస్ట్ చిత్రం ధ్రువ లో ఒక ఐటెం సాంగ్ లో చేయనున్నట్లు వార్తలు వినిపించింది.

ఈ విషయం పై కాజల్ స్పందించింది.  “సినిమాలతో బిజీగా ఉన్న నేను ఐటెం సాంగ్ ఎలా చేస్తాను” అని ప్రశ్నించింది.  తాను ఏ సినిమాలోనూ ఐటెం సాంగ్ చేయడం లేదని స్పష్టం చేసింది.  ప్రస్తుతం తమిళం లో రెండు సినిమాలు చేస్తున్నట్లు వెల్లడించింది. తెలుగులో కూడా తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు తెలిపింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus