కాజల్ అవకాశాన్ని అందుకున్న శ్రియ

  • March 1, 2018 / 07:23 AM IST

శ్రియ, కాజల్.. వీరిద్దరూ దాదాపు టాలీవుడ్ హీరోలందరితో కలిసి నటించారు. సీనియర్ హీరోయిన్స్ గా పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరిలో కాజల్ కి ఎక్కువ డిమాండ్ ఉంది. ఆమె నటించిన గత చిత్రాలు ఖైదీ నంబర్ 150 , నేనే రాజు నేనే మంత్రి విజయం సాధించాయి. దీంతో రెమ్యునరేషన్ ని అమాంతం పెంచేసింది. ఇప్పుడు ఆమెను సంప్రదించే నిర్మాతలకు భారీ రేట్ చెప్పి షాక్ కి గురిచేస్తోంది. దీంతో దర్శకనిర్మాతలు వేరే హీరోయిన్ ని తీసుకుంటున్నారు. తాజాగా కాజల్ మంచి సినిమాను వదులుకుంది. ఆ ఛాన్స్ ని శ్రియ అందుకుంది. నేనే రాజు నేనే మంత్రి తర్వాత తేజ… వెంకటేష్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

డి.సురేష్‌బాబు, అనిల్‌ సుంకరలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల రెండో వారంలో చిత్రీకరణ మొదలు కానుంది. ఇందులో హీరోయిన్ కోసం అనేకమంది పేర్లు పరిశీలించారు. కాజల్ ని సంప్రదించారు. ఆమె చెప్పిన పారితోషికానికి దిమ్మదిరిగినట్టు టాక్. అందుకే శ్రియను సంప్రదించారు. ఆమె వెంటనే ఒకే చెప్పినట్టు తెలిసింది. పైగా కాజల్ రెమ్యునరేషన్ లో సగానికి ఒప్పుకున్నట్లు సమాచారం. శ్రియ, వెంకటేష్ కలిసి గతంలో “సుభాష్‌ చంద్రబోస్‌”, గోపాల గోపాల సినిమాలు చేశారు. ఇది మూడో మూవీ కానుంది. ‘ఆటా నాదే – వేటా నాదే’ అనే పేరు పరిశీలిస్తున్న ఈ చిత్రంలో నారా రోహిత్‌ ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus