తమిళనాడు గవర్నర్ గా నియమితులైన కృష్ణంరాజుకు శుభాకాంక్షల వెల్లువ

  • January 5, 2017 / 01:53 PM IST

మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ బీజీపీ నేత, రెబల్ స్టార్ కృష్ణం రాజు తమిళనాడు గవర్నర్ గా నియమితులయ్యారు. గత ఆగస్టులో గవర్నర్ రోశయ్య పదవీ విరమణ చేసినప్పటి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. ఇప్పటివరకు ఇన్ ఛార్జి గవర్నర్ గా విద్యాసాగరరావు కొనసాగారు. కొన్ని రోజుల క్రితం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తీవ్ర అనారోగ్యంతో మరణించడంతో అక్కడి రాజకీయాల్లో పెను మార్పులు సంభవించాయి. ఈ సమయంలో అక్కడ గవర్నర్ తప్పనిసరిగా ఉండాలని భావించిన కేంద్రం కొంతమంది తెలుగు నేతల పేర్లను పరిశీలించింది.

అందులో పురందేశ్వరి, హరిబాబు, కృష్ణం రాజు పేర్లు బలంగా వినిపించాయి. ఈ ముగ్గురులో కృష్ణం రాజుని ఎంపిక చేస్తున్నట్లు నేడు ప్రకటించింది. దీంతో రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు కృష్ణం రాజుకు అభినందనలు తెలిపారు. బాహుబలి షూటింగ్ లో ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా కృష్ణం రాజుకి శుభాకాంక్షలు చెప్పారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus