అమితాబ్ బచ్చన్ స్థానం కైవసం చేసుకున్న కృష్ణంరాజు

  • January 27, 2017 / 09:04 AM IST

నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి రికార్డులను బద్దలుకొడుతోంది. క్రిష్ దర్శకత్వం లో వచ్చిన ఈ మూవీ బాలయ్య క్రేజ్ ని మరింత పెంచింది. దీంతో నటసింహ 101 సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇందుకోసం క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ  అద్భుతమయిన కథను సిద్ధం చేశారు. “రైతు” అని టైటిల్ తో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటింపచేయాలని కృష్ణవంశీ, బాలయ్య ప్రయత్నించారు. సర్కార్ 3 షూటింగ్ లో ఉన్న అమితాబ్ ని కలిసి కథను కూడా వినిపించారు. అయితే ఆయన చేస్తాను? చెయ్యను? అనే విషయంలో ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు.

రెండు నెలలు పాటు ఎదురుచూసిన డైరక్టర్ ఆ పాత్రను రెబల్ స్టార్ కృష్ణం రాజు తో చేయించాలని డిసైడ్ అయ్యారు. ఇందుకు రెబల్ స్టార్ కూడా అంగీకరించినట్లు ఫిల్మ్ నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. బాలకృష్ణ, కృష్ణం రాజు కలిసి గతంలో సుల్తాన్ మూవీ చేశారు. అది నిరాశ పరిచినప్పటికీ, రైతుల కష్టాలపై తెరకెక్కుతున్న ఈ  సినిమా సూపర్ హిట్ అవుతుందని నందమూరి అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus