వరుణ్ తో లావణ్య రెండోస్సారి.!

  • April 9, 2018 / 06:40 AM IST

సాయిధరమ్ తేజ్ సరసన నటించిన “ఇంటిలిజెంట్” డిజాస్టర్ గా నిలవడంతోపాటు కథానాయికగా, నటిగా లావణ్య త్రిపాఠి ఇమేజ్ ను దారుణంగా డ్యామేజ్ చేసింది. ఆ సినిమా తర్వాత అమ్మడికి మరో ఆఫర్ దొరకలేదు. ఇంక అమ్మడికి అవకాశాలు దొరకం కూడా కష్టమే అనుకొన్నారందరూ. కట్ చేస్తే.. లావణ్య త్రిపాఠి మరో మెగా ఆఫర్ ను అందుకొన్నట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ కథానాయకుడిగా “ఘాజీ” ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో గతేడాది “గౌతమీపుత్ర శాతకర్ణి”తో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొన్న ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మాణంలో బిబో శ్రీనివాస్ సమర్పణలో జాగర్లమూడి సాయిబాబా-రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్న విషయం తెలిసిందే.

ఈ చిత్రంలో వరుణ్ సరసన కథానాయికగా ఇప్పటికే అదితిరావు హైదరీని ఎంపిక చేయగా.. ఇప్పుడు మరో కథానాయికగా లావణ్య త్రిపాఠిని ఫైనల్ చేసారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెలాఖరుకు మొదలవ్వనుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ వైవిధ్యమైన చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే చిత్రబృందం వెల్లడించనుంది. వరుణ్ తో లావణ్య ఆల్రెడీ “మిస్టర్” అనే సినిమాలో నటించి ఉండడం గమనార్హం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus