వియాత్నంలో రాత్రి వేళల్లో ఫైట్ చేయనున్న మహేష్

  • March 25, 2017 / 08:56 AM IST

తమిళ దర్శకుడు ఏ ఆర్ మురుగ దాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. భారీ బడ్జెట్ తో ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమవుతున్నఈ సినిమా బృందం నిన్న ‘వియత్నాం’ కి వెళ్లింది. మహేష్ బాబు కూడా వియాత్నం చేరుకున్నారు. ఈ రోజు రాత్రి నుంచి నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకూ అక్కడ ఒక యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించనున్నారు. పది రోజుల పాటు సాగే ఏ షెడ్యూల్ లో మహేష్ బాబు, విలన్ ఎస్.జె సూర్య, ఫైటర్లకు  మధ్య భారీ ఫైట్ ఉంటుంది.

ఈ యాక్షన్ సీక్వెన్స్ ని పీటర్ హెయిన్స్ డిఫరెంట్ గా కంపోజ్ చేయనున్నట్లు సమాచారం. ఇంటెలిజన్స్ ఆఫీసర్ గా ప్రిన్స్ కనిపించనున్న ఈ మూవీలో ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఉగాదికి రిలీజ్ కానుంది. అప్పుడే టైటిల్ పై వస్తున్న ప్రచారాలకు తెరపడనుంది. భారీ అంచనాలున్న ఈ ఫిల్మ్ జూన్ 23 న థియేటర్లలోకి రానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus