రిలీజ్ కి ముందు ప్రసాద్ ల్యాబ్స్ లో వంద షోలు వేసినా ఏ డిస్ట్రిబ్యూటర్ సినిమాని కొనలేదు : మంచు విష్ణు!

హీరోగా మంచు విష్ణు (Manchu Vishnu) చాలా సినిమాలు చేశారు, చేస్తున్నారు. దాదాపు ఆయన చేసిన సినిమాలు అన్నీ సొంత ప్రొడక్షన్లోనే..! అయినప్పటికీ విష్ణుకి చెప్పుకోదగ్గ హిట్లు ఉన్నాయి. ముఖ్యంగా ‘ఢీ’ (Dhee) సినిమాకి అయితే కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పాలి. శ్రీను వైట్ల (Srinu Vaitla) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. కానీ ఈ సినిమా థియేటర్ హక్కులు కొనుగోలు చేయడానికి రిలీజ్ కి ముందు ఎవ్వరూ రాలేదట. ఇలా ‘ఢీ’ రిలీజ్ కష్టాలు చెప్పుకొచ్చాడు మంచు విష్ణు.

Manchu Vishnu

మంచు విష్ణు మాట్లాడుతూ.. “2006 నవంబర్ 23 కి ‘ఢీ’ సినిమా ప్రసాద్ ల్యాబ్స్ లో ఫస్ట్ షో పడింది. కానీ ఆ సినిమా 2007 ఏప్రిల్ కి రిలీజ్ అయ్యి.. ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మధ్యలో ప్రసాద్ ల్యాబ్స్ లోనే 100 కి పైగా షోలు పడ్డాయి. దిల్ రాజు (Dil Raju) గారితో సహా ఆ సినిమాని ఎవ్వరూ కొనుక్కోలేదు. ‘ఇది యావరేజ్ సినిమా అమ్మా.. ఆడదు ఇది, కష్టమే’ అని చెప్పి ఎవ్వరూ డిస్ట్రిబ్యూట్ చేయలేదు.

కానీ చివరికి అది నాన్నగారే తీసుకుని రిలీజ్ చేయడం జరిగింది” అంటూ చెప్పుకొచ్చారు. ‘ఢీ’ సినిమాలో కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది. ‘బన్నీ’ వంటి హిట్ సినిమాలు అందించిన మల్లిడి సత్యనారాయణ రెడ్డి (Mallidi Satyanarayana Reddy) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో మంచు విష్ణు కామెడీ టైమింగ్ కూడా ప్రేక్షకులను అలరించింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus