మెగా హీరోల మల్టీ స్టారర్ మూవీ పట్టాలెక్కనుంది

  • January 23, 2017 / 01:30 PM IST

ఇద్దరి స్టార్ హీరోలు నటించగల కథ రాయడం చాలా కష్టమయిన పని. అందుకే మల్టీ స్టారర్ మూవీ అంటే డైరక్టర్లు చాలా భయపడుతుంటారు. భారీ బడ్జెట్ అవుతుందని నిర్మాతలు వెనుకడుగు వేస్తుంటారు. కానీ ప్రముఖ వ్యాపార వేత్త, సినీ జనబంధు టి. సుబ్బిరామి రెడ్డి మాత్రం భారీ మల్టీ స్టారర్ మూవీ ప్లాన్  చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్ర నిర్మాణంలో ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కూడా భాగం పంచుకోనున్నట్లు సమాచారం.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 మూవీ విజయాన్ని సొంతం చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుబ్బిరామి రెడ్డి ఈ విషయాన్నీ మీడియా మిత్రులతో పంచుకున్నారు. ప్రస్తుతం స్టోరీ సిట్టింగ్స్ జరుగుతున్నాయని, కథ కొలిక్కి రాగానే అధికారికంగా ప్రకటించనున్నట్లు వివరించారు. దీంతో మెగా అభిమానులు సంబర పడిపోతున్నారు. మెగా హీరోలందరినీ ఒకే చిత్రంలో చూసేందుకు రెండు కళ్లు సరిపోవని చెబుతున్నారు. ఈ సినిమా థియేటర్లోకి వస్తే అనేక రికార్డులు సొంతం చేసుకోవడం గ్యారంటీ అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus