అహ్మదాబాద్ లో షూటింగ్ కి ఏర్పాటు చేస్తున్న మురుగదాస్ టీమ్

  • November 15, 2016 / 11:31 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్నమూవీ మూడు షెడ్యూల్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం 60 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంది. గత నెల రోజులుగా హైదరాబాద్ బిజీ రోడ్లపై షూట్ చేసిన ఛేజింగ్ సీన్ బాగా వచ్చిందని మురుగదాస్ బృందం సంతృప్తిగా ఉంది. ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా  ప్రిన్స్ నటిస్తున్న ఈ చిత్రంలో విలన్ గా తమిళ దర్శకుడు, నటుడు ఎస్.జె.సూర్య ఆకట్టుకోనున్నారు.

100 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ నాలుగో షెడ్యూల్ గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో జరగనుంది. ఇక్కడ మహేష్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ల మధ్య  రొమాంటిక్ సీన్స్ తో పాటు, కొన్నికీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈనెల 24  నుంచి మొదలై దాదాపు నెల రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ తో టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేయాలనే ఆలోచనలో డైరక్టర్ ఉన్నారు. అక్కడకు వెళ్లే ఏర్పాటుల్లో మురుగ దాస్ టీమ్ బిజీగా ఉంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus