అర్జున్ రెడ్డి కాంబో.. మైత్రి బిగెస్ట్ ప్లాన్

  • February 8, 2021 / 08:11 PM IST

మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే ఒక బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్. తెలుగులో గ్యాప్ లేకుండా అగ్ర తారలతో సినిమాలను సెట్స్ పైకి తెస్తోంది. చిన్నా పెద్దా అని తేడా లేకుండా మంచి కంటెంట్ సినిమాలతో తన స్థాయిని పెంచుకుంటోంది. ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ హౌజ్ లో పది సినిమాలు రూపొందుతున్నాయి. ఇక మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. మైత్రి ప్రొడక్షన్ హౌస్ కొంతకాలంగా అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగాతో చర్చలు జరుపుతోంది.

విజయ్ దేవరకొండతో మరో సినిమాను చేయించాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని కథలపై కూడా డిస్కషన్ జరిగిందట. విజయ్ కూడా మైత్రికి ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం మరో రెండు సినిమాలను చేయాల్సి ఉంది. ఇక వీలైనంత త్వరగా సందీప్ వంగా, విజయ్ దేవరకొండ కాంబినేషన్ ను సెట్స్ పైకి తీసుకురావాలని ఈ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం విజయ్ లైగర్ సినిమాతో బిజీగా ఉండగా

దర్శకుడు సందీప్ బాలీవుడ్ లో రణ్ బీర్ కపూర్ తో ఒక యాక్షన్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ముందు స్క్రిప్ట్ లాక్ చేసుకొని ప్రాజెక్ట్ పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వాలని చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాదిలో అర్జున్ రెడ్డి కాంబోలో సినిమా రానున్నట్లు టాక్.

Most Recommended Video

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus