కుమారుల పెళ్లి విషయం త్వరలోనే ప్రకటిస్తా….నాగ్!!

  • September 5, 2016 / 02:54 PM IST

టాలీవుడ్ లో తాజాగా ఎక్కడ విన్నా వినిపిస్తున్న మాట ఏంటి అంటే…..నాగ్ కుమారుల పెళ్లి ఎప్పుడూ అని…అనుకోకుండా ఒకేసారి ఇద్దరు కుమారుల ప్రేమ వ్యవహారం బయటకు రావడంతో, మీడియా మొత్తం నాగ్ ఫ్యామిలీపైనే ఫోకస్ పెట్టింది. ఇక మరో పక్క అఖిల్ విషయం పక్కన పెడితే… చైతు-సమంత ఇద్దరూ అఫీషియల్ గా ఫంక్షన్స్ కు హాజరు అవుతూ ఉండడంతో పెళ్లిపై మరింత ఆసక్తిగా ఎదురు చూస్తుంది టాలీవుడ్ మీడియా. ఇదిలా ఉంటే తాజాగా ఒక మూవీ ప్రమోషన్ లో భాగంగా నాగ్ ను మీడియా వాళ్ళు అందరూ పిల్లల పెళ్లి గురించి అడగగా….నాగ్ సైతం చాలా పోసీటీవ్ గా, చాలా కూల్ గా స్పందించాడు.

పిల్లల పెళ్లి విషయం గురించి కంగారు పడాల్సింది ఏమీ లేదు అని, ఆ పెళ్లి విషయాలు, వివరాలు ప్రకటించడానికి మంచి ముహూర్తం చూసుకోవాలని…మంచి ముహూర్తం చూసి నేనే ప్రకటిస్తా అని స్పష్టం చేశాడు నాగ్. ఇక నాగ్ చెప్పిన వివరాల ప్రకారం చూస్తే…త్వరలోనే వారసుల పెళ్లి విషయం గురించి ప్రకటన వచ్చేలా ఉంది అని అంటున్నాయి మీడియా వర్గాలు….అంటే త్వరలోనే అక్కినేని వారి ఇంట పెళ్లి బాజాలు మొగనున్నాయి అన్న మాట….ఇక ఈ వార్త వినిగానే అక్కినేని ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus